వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట కనేకల్ మండలాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు గురువారం సుడిగాలి పర్యటన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలోనే ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని ప్రజలకు హామీ ఇచ్చి ముందుకు సాగారు.