
గజపతినగరం: 'జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి'
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం గజపతినగరం కోర్టులో లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ పై కక్షిదారుల్లో అవగాహన పెంచాలని సూచించారు. లోక్ అదాలత్ వలన డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.