పింఛన్ ఠంచన్ గా రావాలంటే జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలి
పింఛన్ ఠంచన్ గా రావాలంటే జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం నర్సంపేట, చందలూరు, మసివానిపాలెంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ సురేష్ బాబు తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే జగన్ ముఖ్యమంత్రిగా రావాలన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా ఝాన్సీ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.