మాజీ మంత్రి పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు గడవకముందే పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే కులం చూడం, మతం చూడం అంటూ నియోజకవర్గంలో 30% ఓట్లు కూడా రాలేదని అన్నారు.