ముథోల్
రామ భక్తులను వెంటనే విడుదల చేయాలి
రామ భక్తులను వెంటనే విడుదల చేయాలని ముధోల్ బిజెపి ఇంచార్జ్ తాటివార్ రమేష్ అన్నారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ భైంసాలో కార్నర్ మీటింగ్ సందర్భంగా హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడంతో అక్కడున్న రామ భక్తులు గో బ్యాక్ కేటీఆర్ అని శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగిందని అన్యాయంగా అరెస్టు చేయించడం తగదని అన్నారు. బేషరతుగా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.