అధికారులు అప్రమత్తంగా ఉండండి
హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో మేయర్ విజయలక్ష్మి శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు, నాలాల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా వరకు ఏరియాల్లో వర్షం నిలిచిపోయింది.