మార్కాపురం: నట్టేట ముంచిన అకాల వర్షాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండల రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. మండలంలో 202 ఎకరాలలో మినుము పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురవడంతో దిగుబడి భారీగా తగ్గిపోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం పై అంచనా వేసిన అధికారులు 202 ఎకరాలలో మినుము పంట వేసిన రైతులు నష్టపోయినట్లుగా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు గురువారం తెలిపారు.