పెదపూడి లో టిడిపి నుంచి వైసీపీలోకి పలువురి చేరిక
పెదపూడి లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి బుధవారం పలువురు నాయకులు చేరారు. గ్రామానికి చెందిన 30 తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వైసీపీలో చేరగా వారికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో వైసిపి పై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. మళ్లీ జగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.