తణుకులో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి
తణుకు పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక వైయస్సార్ పార్క్ వద్ద సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు అమరవీరుల భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలివేంద్రం ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీవీ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.