భగభగమంటున్న భానుడు
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రంగానే ఉంటోంది. ఏడు గంటల వరకు వేడిగాలులు వీస్తున్నాయి. శుక్రవారం హైద్రాబాద్ లో పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలు నమోదైంది.