ఎల్ బి నగర్ లో ఈటల రాజేందర్ ప్రచారం
మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎల్ బి నగర్ లోని నందనవనం, భూపేష్ గుప్తా నగర్ లో గురువారం ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని చేయాలి అని ఇంటింటికి తిరిగి అత్యధిక మెజార్టీతో బిజెపిని గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నరేష్ యాదవ్, ఎరుకల మల్లేష్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.