కిషన్ నగర్ లో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం
ఉమ్మడి మద్దూర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.