ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నాయకోట్ వాడకు చెందిన భీమయ్య మాతృమూర్తి మృతి చెందడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శనివారం తాను అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత బాధిత కుటుంబ సభ్యులకు రూ. పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.