
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చెందుర్తిలో వాటర్ప్లాంట్ ప్రారంభోత్సవంలో గొడవ జరిగింది. జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.