పలాస - Palasa

శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. మ‌త్తు మందు ఇచ్చి అత్యాచారం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. మ‌త్తు మందు ఇచ్చి అత్యాచారం

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ వివాహితపై ఉమామ‌హేశ్వ‌ర‌రావు అనే ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచారం చేశాడు. వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో A1 అనే పేరుతో క్లీనిక్ ను నడుపుతున్నాడు. అనారోగ్య సమస్యతో క్లీనిక్ కు వచ్చిన ఓ వివాహితకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేసిన‌ట్లు తెలుస్తోంది. మత్తులో ఉండటం వలన బాధిత మ‌హిళ బయటపడలేకపోయింది. ఇంటికి వెళ్లాక భర్తతో చెప్పడంతో వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు త‌ర‌లించారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా