మక్తల్
ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్
రేపటి పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఆదివారం నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4, 80, 355 మంది ఓటర్లకు గాను 554 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారని పేర్కొన్నారు.