బస్సులు లేక ఎలా వెళ్లాలి
బస్సులు లేకపోవడంతో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని ప్రజలు, ప్రయాణికులు వాపోయారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డ ప్రజలు, ప్రయాణికులు ఆదివారం ఉట్నూర్ బస్ స్టాండ్ కు వచ్చారు. అయితే చాలా ఆర్టీసీ బస్సులను ఎన్నికల ప్రక్రియ కోసం వినియోగించడంతో బస్సుల కొరత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.