గోల్కొండ లో కార్వాన్ ఎమ్మేల్యే ఇంటింట ఎన్నికల ప్రచారం
ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ శుక్రవారం గోల్కొండలో ప్రచారం చేశారు. ఎంపీ నిధులతో స్థానికంగా చేపట్టిన అభివృద్ది పనులపై అవగాహన కల్పించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిస్కరిస్తున్నట్లు తెలిపారు. మరోసారి అసదుద్దీన్ ఒవైసీకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు