ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు...
హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరు రేపు ఓటు వేసేందుకు రావాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, మేడ్చల్-మల్కాజ్ గిరి కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి కలెక్టర్ శంశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని కోరారు.