పటాన్చెరు నియోజకవర్గం
ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం
పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యమైంది. ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన బీడీఎల్ పీఎస్ పరిధిలో జరిగింది. బిహార్ కు చెందిన వివాహిత, భర్త, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయస్సున్న కుమార్తెతో కలిసి పటాన్ చెరులో నివాసం ఉంటుంది. ఈ నెల 2న ఆసుపత్రికి అని ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.