బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం
రామగుండం నియోజకవర్గంలోని బిఎల్ఓ సూపర్వైజర్లతో ఎన్.టి.పి.సి మిలీనియం హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అధ్యక్షతన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులు సక్రమంగా, అప్రమత్తతతో వ్యవహరించాలని అరుణశ్రీ సూచించారు. ఈ సమావేశంలో రామగుండం తహసిల్దార్ కుమార స్వామి, డిప్యూటీ తహసిల్దార్ విజయ్, తదితరులు పాల్గోన్నారు.