మంథని
బిజెపి నాయకుల ప్రచారం
మంథని మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో బిజెపి నాయకులు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతరవేణి క్రాంతి కుమార్, టౌన్ అధ్యక్షుడు సబ్బని సంతోష్, బూత్ కార్యదర్శి మూగ రామ్మూర్తి, నాయకులు మల్లేష్, సామల అశోక్, పాల్గొన్నారు.