మక్తల్
పాలమూరు గడ్డపై ఎగిరేది బిజెపి జెండానే
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొంది పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని నాయకులు ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కర్నె స్వామి, బాల్చేడు మల్లికార్జున్, రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.