
చోడవరం: షుగర్ ఫ్యాక్టరీ ఎండి నిర్లక్ష్యం
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో బాటలో పట్టడానికి స్థానిక ఎమ్మెల్యే, షుగర్ ఫ్యాక్టరీ ఎండి నిర్లక్ష్య వైఖరిని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. శనివారం చోడవరం ఏఆర్జి శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైతు సంఘం కార్యదర్శి రెడ్డిపల్లి అప్పాలరాజు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించి 15 రోజుల్లో 20 సార్లు మోరాయించిందని చెప్పారు. అవసరమైన బెగాస్, ఫైర్వుడ్ అందుబాటులో ఉంచుకోలేకపోయారన్నారు.