ఆముదాలవలస
చిగురువలసలో వైకాపా అభ్యర్థి తమ్మినేని ప్రచారం ముమ్మరం
సరుబుజ్జిలి మండలం చిగురువలస తదితర గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో పేదవాడి సంక్షేమాన్ని కోరుకునే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తులను నమ్ముకొని ప్రభుత్వం నడపలేదని ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఆకాంక్షించి పరిపాలన చేశారన్నారు.