పంపు హౌస్ సమీపంలో ఏనుగులు
గరుగుబిల్లి మండలం తోటపల్లి పంప్ హౌస్ సమీపంలో ఏడు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శనివారం తెలిపారు. సమీప ప్రాంతం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలలో పశువులను ఉంచరాదన్నారు.