మంచిర్యాల
బీజేపీలో పలువురు చేరిక
లక్షేట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళలు శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని కోరారు.