వైసీపీ ప్రభంజనంలో కూటమి తుడిచి పెట్టుకుపోతుంది: శిల్పా రవి
రాష్ట్రంలో వీస్తున్న ఫ్యాన్ గాలికి, జగనన్న ప్రభంజనానికి కూటమి పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో శుక్రవారం మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యర్రబోలు పురుషోత్తం రెడ్డి ఆద్వర్యంలో వైసిపి అభ్యర్థులు ఎమ్మెల్యే శిల్పారావు, చంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.