
నంద్యాల: మల్లికార్జున స్వామి ఆలయంలో శివ స్వాములకు భిక్ష కార్యక్రమం
నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివ స్వాముల భిక్ష కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కసెట్టి చంద్రశేఖర్, ఉపేంద్ర నాథ్ రెడ్డి, లక్ష్మి రెడ్డి, ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. శివరాత్రి వరకు శివ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.