అడ్డాకుల వద్ద వోల్వో బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి(165) అడ్డాకుల సమీపంలోని స్నేహ కంపెనీ వద్ద బుధవారం తెల్లవారుజామున వోల్వో బస్సు బోల్తా పడగా పది మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు లారీని తప్పించబోయి బోల్తా పడినట్లు డ్రైవర్ రత్నం తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అడ్డాకుల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.