

పండగ రోజు విద్యార్థులను కొడతారా?: కేఏ పాల్ (VIDEO)
HCU సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పదించారు. పండగ రోజు విద్యార్థులను కొడతారా? అని ప్రశ్నించారు. 'రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఏం జరుగుతోంది? రంజాన్ పండగ రోజు విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తారా? 72 గంటల్లో HCU వద్ద పనులు ఆపాలి. లేదంటే పిల్ వేస్తా. HCUలో లక్ష కోట్ల విలువ గల 400 ఎకరాల భూములను లాక్కునే ప్రయత్నాన్ని ఆపకపోతే ప్రభుత్వాన్ని కూలగొడతాం' అని హెచ్చరించారు.