పాతపట్నం
ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని హిరమండలం ఏపీఎం శ్రీరామచంద్రమూర్తి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహిళా సంఘ సభ్యులతో ఏం. ఏం. ఎస్. కార్యవర్గ సభ్యులతో కలిసి స్వీప్ కార్యక్రమం పై అవగాహన చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఓటు ను తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు. ఓటును ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా మీకు నచ్చిన మంచి వ్యక్తికి వేయాలన్నారు.