దుబ్బాక
నకిలీ విత్తనాలు అమ్మేవారిపై నిఘా: సీపీ
ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను రైతులకు అమ్మే వారిపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు సిద్దిపేట సీపీ అనురాధ ఆదివారం తెలిపారు. వ్యవసాయశాఖ, టాస్క్ ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.