చాంద్రాయణగుట్ట
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పై సీఎం సమీక్ష
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న 3 ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. అందరు క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు.