నేడు వైఎస్ భారతిరెడ్డి, సమతారెడ్డిల ప్రచారం
సింహాద్రిపురం మండలంలోని రావులకొలను గ్రామంలో నేడు బుధవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సతీమణి సమతారెడ్డిలు వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు గండ్లూరి వీరశివారెడ్డితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు మంగళవారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నాయకులు, కార్యకర్తలు. పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.