ఆదిలాబాద్
పిడుగుపాటు ఘటనలో ఓ వ్యక్తి మృతి
జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై అయిదుగురు గాయాలపాలు కాగా.. వారిని హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు.