సంగారెడ్డి నియోజకవర్గం
ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి: హరీష్
ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను అమలు చేయని హామీలపై నిలదీయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ గురువారం రాత్రి నిర్వహించారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.