హుజూర్ నగర్ నియోజకవర్గం
మతోన్మాద బీజేపీని ఓడించాలి
మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం గరిడేపల్లి మండలం గానుగు బండలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కమ్యూనిస్టులు తీవ్రంగా కృషి చేయాలన్నారు.