రాయచోటి
కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు ఆశయాలను కొనసాగిస్తాం
అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు నాలుగవ వర్ధంతి సందర్భంగా రాయచోటి పట్టణ కేంద్రంలో మంగళవారం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓంగిమల్ల రంగారెడ్డి అధ్యక్షతన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ నదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులు మరియు సాగునీటి పారుదల ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేశారన్నారు.