అశ్వారావుపేట
తిమ్మంపేటలో ఎన్నికల ప్రచార హోరు
ములకలపల్లి మండలం తిమ్మంపేటలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతీ గడపగడపకు తిరుగుతు ప్రజలకు గతంలో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీపిఎం, టిడిపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.