పటాన్చెరు నియోజకవర్గం
కనువిందు చేసిన సూర్యాస్తమయం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం మండల వాసులను కనువిందు చేసింది. ఎరుపు వర్ణంలో అరుణ కిరణాలు మిరుమెట్లు గొలుపుతూ సంధ్య వేళ అస్తమించింది. సూర్యాస్తమయ దృశ్యాలు పలువురిని విశేషంగా కనువిందు చేశాయి. పలువురు ప్రకృతి ప్రేమికులు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో బంధించి సంబరపడ్డారు.