కృష్ణా-విజయవాడ - Krishna-Vijayawada

ప్రజలతో మమేకమై ప్రజాహితమై దూసుకొనిపోతున్న వెనిగండ్ల రాము

ప్రజలతో మమేకమై ప్రజాహితమై దూసుకొనిపోతున్న వెనిగండ్ల రాము

నందివాడ మండలం పుట్టగుంట,పెద్ద లింగాల, చిన్న లింగాల, గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు పేద ప్రజల మనిషి అని ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడు అని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందేలా చొరవ తీసుకుంటామని తెలిపారు.. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు , జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి , రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మరియు గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, నందివాడ మండల తెలుగు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీడియోలు