అనకాపల్లి జిల్లాలో విషాదం
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కశింకోట శివారులోని ఏలేరు కాలువలో స్నానానికి దిగి ఒకరు దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. రైల్వే ట్రాక్ పనులు చేయడానికి వచ్చిన కొంతమంది గుడారాలు వేసుకొని ఉంటున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు స్నానానికి దిగారు. వీరిలో ఒకరు కాలువ లోతుగా ఉండటంతో ఈత రాక మునిగిపోయాడు. సహచరులు ఇద్దరూ రక్షించేందుకు ప్రయతించినా అప్పటికే మృతి చెందాడు.