
బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్టు
భారత్కు చెందిన మెహల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్లు మోసం చేసి పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో చోక్సీ బెల్జియంలో ఉన్నట్లు తెలియడంతో అక్కడి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు చోక్సీని అరెస్ట్ చేయగా భారత్కు రప్పించేందుకు చర్యలు చేపట్టారు.