సూళ్లూరుపేట
ఏకొల్లులో తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారిసత్రం ఏకొల్లు, కుప్పారెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం తెదేపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. మాజీ జడ్పీటీసీ శ్రీహరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఉదయకుమార్, మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి, బూత్ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, హరి, రాఘవయ్య ఆదిముని పాల్గొన్నారు.