'వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయి'
వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. "మా హయాంలో హైదరాబాద్లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశాం. హజ్ హౌస్ నిర్మించి పలువురిని మక్కా పంపించాం. కడప, విజయవాడలో హజ్హౌస్లు నిర్మించాం. షాదీ మంజిల్ కట్టించాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క భవనమైనా నిర్మించారా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. నెల్లూరులోని షాదీ మంజిల్లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.