విజయనగరం
అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా
విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 2వ పట్టణ పీఎస్ పరిధిలోని వై. ఎస్. ఆర్. నగర్ లో సిఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, అనుమానస్పద వ్యక్తుల కదలికలు గురించి కాలనిలో ప్రతీ ఇంటి పరిసరాల్లోని, వీధుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నించి, వారి గురించి ఆరా తీసారు.