కురుపాం
పుష్పశ్రీవాణికు బ్రహ్మరథం పట్టిన గుమ్మలక్ష్మీపురం ప్రజలు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైసిపి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గుమ్మలక్ష్మీపురం, లక్కగూడ, మొరమ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆమెకు ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ బ్రహ్మరధం పట్టారు.