ఆచంట
పెనుగొండలో పాదయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి పితాని
ఆచంట నియోజకవర్గం నుంచి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఈరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమైన పాదయాత్రలో వేలాది మంది అభిమానులతో పాల్గొన్నారు. పాదయాత్ర కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సిద్ధాంతం రోడ్డు మీదుగా పెనుగొండ పట్టణంలో ప్రవేశించింది పాదయాత్రలో మహిళలు జనసైనికులు తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.