![చెరువు మట్టి తోలకంపై వివాదం, ఇరువర్గాల ఘర్షణ చెరువు మట్టి తోలకంపై వివాదం, ఇరువర్గాల ఘర్షణ](https://media.getlokalapp.com/cache/19/a9/19a9774234b83ca452dc4ab38009d824.webp)
హుజూర్ నగర్ నియోజకవర్గం
చెరువు మట్టి తోలకంపై వివాదం, ఇరువర్గాల ఘర్షణ
చింతలపాలెం మండలంలోని శోభనాద్రిగూడెంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సైదిరెడ్డి బుధవారం తెలిపారు. శోభనాద్రిగూడేనికి చెందిన దేశినేని రామారావు, పీక్లానాయక్ తండా వాసి లకావత్ సైదులు మధ్య టిప్పర్ల విషయంలో వివాదం తలెత్తింది. ఈ మేరకు 12 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.